అతను మిల్క్ బూత్ తెరవగానే ఇద్దరు యువకులు పేరేమిటని అడిగారు.. సమాధానం చెబుతుండగానే.. దారుణానికి పాల్పడ్డారు..

ABN , First Publish Date - 2021-11-08T17:49:10+05:30 IST

బీహార్‌లోని సమస్తీపూర్‌లో ఘోరం చోటుచేసుకుంది.

అతను మిల్క్ బూత్ తెరవగానే ఇద్దరు యువకులు పేరేమిటని అడిగారు.. సమాధానం చెబుతుండగానే.. దారుణానికి పాల్పడ్డారు..

బీహార్‌లోని సమస్తీపూర్‌లో ఘోరం చోటుచేసుకుంది. మిల్క్ బూత్ నిర్వహిస్తున్న వ్యక్తిని తుపాకీతో కాల్చి హత్య చేశారు. రోజూ మాదిరిగానే ఉదయాన్నే దుకాణం తెరిచి, తన పనులలో నిమగ్నమైన దుకాణం యజమాని దగ్గరకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. సర్వేష్ ఠాకుర్ ఎవరని అడిగారు.. తానేనని సమాధానం చెప్పగానే బైక్ మీద నుంచి దిగిన మరో వ్యక్తి అతనిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సర్వేష్ ఠాకుర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఉదంతంతో స్థానికంగా కలకలం చెలరేగింది. జనమంతా మిల్క్ బూత్ దగ్గర గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ హత్యకు గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. ఇందుకోసం పోలీసులు మృతుని సంబంధీకులను విచారిస్తున్నారు. అలాగే నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడిని గ్రామానికి చెందిన సర్వేష్ ఠాకూర్(50)గా గుర్తించారు. ఈ విషయం తెలియగానే మృతుని బంధువులంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సర్వేష్ ఠాకుర్‌కు ఆరు నెలల క్రితం చంపేస్తామంటూ బెదిరింపులు ఎదురయ్యాయని వారు పోలీసులకు తెలిపారు. కాగా పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

Updated Date - 2021-11-08T17:49:10+05:30 IST