గుర్తు తెలియని వ్యక్తి హత్య

ABN , First Publish Date - 2021-10-20T04:49:09+05:30 IST

మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులో చిన్న శక్కర్గ వద్ద నిర్మించిన కంపోస్టు షెడ్డు వద్ద అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తి హత్య


మద్నూర్‌, అక్టోబరు 19: మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులో చిన్న శక్కర్గ వద్ద నిర్మించిన కంపోస్టు షెడ్డు వద్ద అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు. మృతదేహం తల భాగం కాలిపోయి గుర్తు పట్టలేని విధంగా ఉందని తెలిపారు. గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా మన్నారు. సంఘటన స్థలాన్ని బిచ్కుంద సీఐ శోభన్‌ సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర సరిహద్దులో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2021-10-20T04:49:09+05:30 IST