ఇందిరా మైదానంలో యువకుడి హత్య
ABN , First Publish Date - 2021-10-19T06:53:04+05:30 IST
తిరుపతి నగరం ఇందిరా మైదానంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. కలిసి మద్యం తాగిన ఇద్దరు యువకులు గొడవపడటం ఈ హత్యకు దారితీసినట్టు తెలుస్తోంది.
సిమెంటు ఇటుకతో కొట్టి హతమార్చిన సహచరుడు
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 18: తిరుపతి నగరం ఇందిరా మైదానంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. కలిసి మద్యం తాగిన ఇద్దరు యువకులు గొడవపడటం ఈ హత్యకు దారితీసినట్టు తెలుస్తోంది. స్థానికులు, ఈస్ట్ పోలీసులు తెలిపిన ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు కలిసి ఇందిరా మైదానంలో సోమవారం రాత్రి మద్యం తాగారు. అనంతరం ఇద్దరిమధ్య గొడవ రేగింది. దీంతో సహచరుడు తోటి యువకుడిని సిమెంటు ఇటుకతో తల వెనుక బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిని గమనించిన స్థానికులు డయల్ 100కు కాల్చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈస్ట్ ఇన్చార్జి సీఐ సుధాకర్రెడ్డి, ఎస్ఐ ప్రకా్షకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా, హతుడి సెల్ఫోన్ను కూడా నిందితుడు తీసుకెళ్లిపోయాడు. దీంతో హతుడి వివరాలు కనుగొనేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. చివరకు మృతుడి పేరు గిరి అని, పెయింట్ పని చేస్తుంటాడని పోలీసులు గుర్తించారు. అయితే, మరికొందరు స్థానికులు తెలిపిన ప్రకారం ఇందిరా మైదానానికి రాకముందే గిరి మరో వ్యక్తితో గంగమ్మ దేవాలయం వద్ద గొడవ పడ్డట్టు తెలుస్తోంది. అక్కడ్నుంచి వచ్చాక మైదానంలో సహచరుడు సిమెంటు ఇటుకతో కొట్టి హత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. హత్యకు పాల్పడింది ఒకరు కాదని, ఇద్దరు వ్యక్తులని మరికొందరు పేర్కొంటున్నారు. ఈ హత్యపై ఈస్ట్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.