ప్రియురాలు గర్భవతి అయ్యిందని తెలిసి, అబార్షన్ కోసం ప్రయత్నించాడు.... ఫలితం లేకపోవడంతో అదొక్కటే మార్గమనుకున్నాడు... ఏంటది?

ABN , First Publish Date - 2021-10-03T14:59:33+05:30 IST

ఇటీవలికాలంలో అత్యాచారాలు, హత్యలు, అక్రమ సంబంధాల...

ప్రియురాలు గర్భవతి అయ్యిందని తెలిసి, అబార్షన్ కోసం  ప్రయత్నించాడు.... ఫలితం లేకపోవడంతో అదొక్కటే మార్గమనుకున్నాడు... ఏంటది?

ఇటీవలికాలంలో అత్యాచారాలు, హత్యలు, అక్రమ సంబంధాల బాగోతాలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ఇటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చోటుచేసుకుంది. వారంరోజుల క్రితం జరిగిన ఒక హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు భగవత్ శరణ్ ను అరెస్టు చేశారు. అతని ప్రియురాలు గర్భవతి అయ్యిందని తెలుసుకుని, చుట్టుపక్కలవారికి భయపడి అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు భగవత్ శరణ్... గులిడియా నివాసి. అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమించాడు. ఈ నేపధ్యంలో ఆమె గర్భం దాల్చింది. ఐదు నెలలు గడిచాక ఇద్దరిలోనూ... ఎవరు ఏమంటారోననే భయం నెలకొంది.   


మరోవైపు ఆ బాలిక అతనిని వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయసాగింది. దీంతో భగవత్ శరణ్ ఆమెను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి, హత్య చేశాడు. ఈ ఉదంతం గురించి పోలీసు అధికారి రోహిత్ సింగ్ రజ్వాణా మాట్లాడుతూ దేవరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో ఒక బాలిక మృతదేహం ఉన్నట్లు తమకు సమాచారం రావడంతో దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ నేపధ్యంలో నిందితుడిని పోలీసులు అతని ఇంటిలోనే పట్టుకున్నారు. వారి విచారణలో నిందితుడు భగవత్ శరణ్ జరిగినదంతా వెల్లడించాడు. తాను ప్రేమించిన బాలిక గర్భవతి కావడంతో సామాజిక కట్టుబాట్లకు భయపడ్డామని అందుకే అబార్షన్ కోసం ప్రయత్నించామని పోలీసులకు తెలిపాడు.


దీనిలో భాగంగా ఆ బాలికను భగవాన్ శరణ్ పలు ఆసుపత్రుల చుట్టూ తిప్పాడు. ఐదు నెలల గర్భం కావడంతో  ఎక్కడా అబార్షన్ సాధ్యం కాలేదు. దీంతో ఆమెను ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి, తాడుతో ఆమె గొంతు బిగించి హత్యచేశాడు. తరువాత ఆ మృతదేహాన్ని అడవిలో పారేసి, అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన జరిగిన వారం రోజలు తరువాత పోలీసులు... నిందితుడు భగవత్ శరణ్‌ను అరెస్టు చేసి, జైలుకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-03T14:59:33+05:30 IST