పగతో యువకుడి హత్య
ABN , First Publish Date - 2021-09-18T06:43:38+05:30 IST
పగతో యువకుడి హత్య
రెండు నెలల క్రితం మద్యం కోసం గొడవ
గుడివాడ (రాజేంద్రనగర్), సెప్టెంబరు 17 : రెండు నెలల కిందట మద్యం వద్ద ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన స్వల్ప వివాదం నేడు ఓ యువకుడి హత్యకు దారి తీసింది. స్థానిక ఫ్లై ఓవర్ ప్రాంతానికి చెందిన బత్తుల సాయికుమార్ పట్టణంలోని రైల్వేస్టేషన్ ఎదురుగా మద్యం సేవించి నిద్రిస్తుండగా, అతని స్నేహితుడు రాపాని ఏసు గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. సాయిని స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, మెరుగైన వైద్యసేవల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. సాయికుమార్, ఏసు మధ్య రెండు నెలల క్రితం గొడవ జరిగింది. ఈ ఘటనలో ఏసుపై సాయి దాడి చేశాడు. హత్య అనంతరం ఏసు పరారయ్యాడు. కాగా, పాత కక్షతోనే ఏసు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని గుడివాడ టూటౌన్ పోలీసులు అనుమాని స్తున్నారు. సీఐ వి.దుర్గారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.