రౌడీషీటర్‌ దారుణహత్య

ABN , First Publish Date - 2022-07-04T06:33:09+05:30 IST

పాతకక్షల నేపథ్యంలో రౌడీషీటర్‌ ఆదివారం రాత్రి దారుణహత్యకు గురైనట్టు రాజానగరం సీఐ సుభాష్‌ తెలిపారు.

రౌడీషీటర్‌ దారుణహత్య
ఘటనా స్థలంలో మృతదేహం

రాజానగరం, జూలై 3 : పాతకక్షల నేపథ్యంలో రౌడీషీటర్‌ ఆదివారం రాత్రి దారుణహత్యకు గురైనట్టు రాజానగరం సీఐ సుభాష్‌ తెలిపారు.కాతేరు శాంతినగర్‌ ప్రాంతానికి చెందిన గుమ్మడి మోషే (24) గత కొన్నేళ్లుగా రౌడీషీటర్‌గా చలామణి అవుతున్నాడు.గతంలో కూడా మోషేను అంతమొం దించేందుకు పథకం వేసినప్ప టికి తప్పించుకున్నట్టు సమా చారం.అప్పటి నుంచి శత్రువులు కాపుకాసి ఉన్నారు. పాతకక్షల నేపఽథ్యంలో రాజమహేంద్ర వరం రూరల్‌ మండలం రాజానగరం పోలీస్‌ స్టేషన్‌ పరిధి లోని కొంతమూరులో గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో మోది హత్య చేశారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని రాజానగరం పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.ఘటనా స్థలాన్ని డీఎస్పీ సంతోష్‌ సందర్శించారు. హతుడిపై రౌడీషీట్‌ ఉందని.. గతంలో ఒక మర్డర్‌ కేసులో నిందితుడని తెలిపారు.




Updated Date - 2022-07-04T06:33:09+05:30 IST