HYD: బైక్‌ మెకానిక్‌ దారుణ హత్య

ABN , First Publish Date - 2022-01-22T15:36:10+05:30 IST

చింతల్‌ గణే్‌షనగర్‌లో ఓ బైక్‌ మెకానిక్‌ గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. డబ్బు విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో షెడ్‌లో పనిచేసే

HYD: బైక్‌ మెకానిక్‌ దారుణ హత్య

డబ్బు విషయంలో వివాదం!

షెడ్‌లో పనిచేసే యువకుడిపై  అనుమానం

పోలీసుల అదుపులో నిందితుడు?


హైదరాబాద్/జీడిమెట్ల: చింతల్‌ గణే్‌షనగర్‌లో ఓ బైక్‌ మెకానిక్‌ గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. డబ్బు విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో షెడ్‌లో పనిచేసే యువకుడే హత్యచేసి పారిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. చింతల్‌ కల్పన సొసైటీలో నివాసముంటున్న బీరేందర్‌కుమార్‌ సేత్‌(55) గణే్‌షనగర్‌లో ఎంఎన్‌ఎస్‌ పేరుతో బైక్‌ మెకానిక్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి 12గంటలైనా ఇంటికి రాకపోవడంతో అతని కుమారుడు రాజలింగం సేత్‌, షాపునకు వచ్చి చూడగా రక్తపు మడుగులో బీరేందర్‌కుమార్‌సేత్‌ మృతిచెంది పడి ఉన్నాడు. వెంటనే జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి హత్య జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్‌టీం ఆధారాలను సేకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి 10గంటల ప్రాంతంలో బీరేందర్‌ సేత్‌, అతని వద్ద పనిచేసే రొడామిస్త్రీనగర్‌కు చెందిన జహీర్‌ (25) షాపులోనే మద్యం తాగారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య డబ్బు విషయంలో గొడవ జరిగింది. మద్యం మత్తులో బీరేందర్‌సేత్‌ తీవ్ర పదజాలం ఉపయోగించాడు. కోపోద్రిక్తుడైన జహీర్‌.. బీరేందర్‌ సేత్‌ అరవకుండా నోట్లో వస్త్రం కుక్కి, సుత్తితో తలపై కొట్టి హత్యచేసి పారిపోయాడు. రాజలింగం సేత్‌ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ కె.బాలరాజు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Updated Date - 2022-01-22T15:36:10+05:30 IST