ఆస్తి కోసం తండ్రిని చంపిన తనయుడు

ABN , First Publish Date - 2021-10-18T05:30:00+05:30 IST

ఆస్తికోసం కన్నతండ్రిని కొట్టి చంపిన సంఘటన బండారుపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది.

ఆస్తి కోసం తండ్రిని చంపిన తనయుడు
పాపయ్య మృతదేహం

బండారుపల్లి (తాడికొండ), అక్టోబరు 18: ఆస్తికోసం కన్నతండ్రిని కొట్టి చంపిన సంఘటన బండారుపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కళ్లే పాపయ్య (85)కు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరందరికి వివాహాలు కావటంతో వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. పాపయ్యకు సొంతిల్లు ఉండటంతో ఓ గదిలో పాపయ్య దంపతులు, పెద్ద కుమారుడు మరో గదిలో, చిన్న కుమారుడు ఇంకొక గదిలో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన చిన్నకుమారుడు నారాయణ తరుచూ ఆస్తి విషయమై తల్లిదండ్రులతో గొడవపడుతూ ఉంటాడు. ఇంటిని తన పేరుమీద రాయాలని తల్లిదండ్రులను వేధిస్తుంటాంటాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం మద్యం తాగిన నారాయణ తండ్రి పాపయ్యతో గొడవ పడి ఆయన్ను పైకి ఎత్తి కింద పడేశాడు. దీంతో కింద పడిపోయిన పాపయ్య తలకు తీవ్రగాయం కావటంతో అక్కడిక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తాడికొండ ఎస్‌.ఐ వెంకటాద్రి ఘటనా స్ధలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషనకు తరలించారు. 


Updated Date - 2021-10-18T05:30:00+05:30 IST