హత్యను ఖండించిన అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2022-06-03T23:06:17+05:30 IST

పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లా ‎జంగమేశ్వరపాడులో టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్యను వైసీపీ రౌడీమూకలు హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

హత్యను ఖండించిన అచ్చెన్నాయుడు

పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లా ‎జంగమేశ్వరపాడులో టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్యను వైసీపీ రౌడీమూకలు హత్య  చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఫ్యాక్షన్ వైఖరిని నరనరనా నింపుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు మృగాల కంటే హీనంగా తయారై..మనుషుల ప్రాణాలు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జల్లయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, హత్య చేసిన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. సరిగ్గా రెండేళ్ల ‎తర్వాత వైసీపీ నాయకులు చేసిన ప్రతి అరాచకానికి బోనస్ కలిపి ఇస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2022-06-03T23:06:17+05:30 IST