Hyderabad: సరూర్‌నగర్ పరువు హత్య కేసులో నిందితులకు ఏ సంస్థతో సంబంధాలు లేవు: పోలీసులు

ABN , First Publish Date - 2022-05-17T17:12:39+05:30 IST

సరూర్‌నగర్ పరువు హత్య కేసులో నిందితులకు పోలీసు కస్టడీ ముగిసింది. కస్టడీలో కీలక అంశాలు వెలుగు చూశాయి. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఇద్దరే హత్యకు కుట్ర చేశారు.

Hyderabad: సరూర్‌నగర్ పరువు హత్య కేసులో నిందితులకు ఏ సంస్థతో సంబంధాలు లేవు: పోలీసులు

Hyderabad: సరూర్‌నగర్ పరువు హత్య కేసులో నిందితులకు పోలీసు కస్టడీ ముగిసింది. కస్టడీలో కీలక అంశాలు వెలుగు చూశాయి. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఇద్దరే హత్యకు కుట్ర చేశారు. పోలీసులు సీన్ రీ కన్ట్రక్షన్ పూర్తి చేసి, ఇద్దరు నిందితుల కాల్ డేటాను సేకరించారు. ఘటన జరిగిన రోజు కుటుంబ సభ్యులతో తప్ప నిందితులు ఎవ్వరితో మాట్లాడలేదు. G mail ద్వారా Find my device లోకి వెళ్లి నాగరాజు లొకేషన్‌ను పోలీసులు కనుగొన్నారు. నిందితులకు ముస్లిం సంస్థలతో సంబంధాలు ఉన్నాయని కొందరి ఆరోపణలను పోలీసులు ఖండించారు. నిందితులకు ఏ సంస్థతో సంబంధాలు లేవని పేర్కొంటూ వారిని కోర్టులో హాజరుపర్చారు.  

Updated Date - 2022-05-17T17:12:39+05:30 IST