పల్నాడులో మరో రాజకీయ హత్య
ABN , First Publish Date - 2022-06-03T22:47:48+05:30 IST
పల్నాడు జిల్లా: పల్నాడులో మరో రాజకీయ హత్య జరిగింది. దుర్గి మండలం జంగమేశ్వరపాడులో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు మారణాయుధాలతో దాడి చేశారు. వేట కోడవళ్ళతో నరకడంతో
పల్నాడు జిల్లా: పల్నాడులో మరో రాజకీయ హత్య జరిగింది. దుర్గి మండలం జంగమేశ్వరపాడులో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు మారణాయుధాలతో దాడి చేశారు. వేట కోడవళ్ళతో నరకడంతో కంచర్ల జల్లయ్య (35) మృతి చెందాడు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. జల్లయ్య గ్రామం వదిలి మూడేళ్లుగా మాడుగుల గ్రామంలో ఉంటున్నాడు. శుక్రవారం దుర్గిలోని బ్యాంక్కు వెళుతుండగా దాడి చేశారు. దాడిలో మరో ఇద్దరు ఎల్లయ్య , బక్కయ్యలకు గాయాలయ్యాయి.