భగ్గుమన్న పాత కక్షలు.. కడప జిల్లాలో దారుణ హత్య
ABN , First Publish Date - 2020-05-11T16:59:05+05:30 IST
. భూతగాదా నేపధ్యంలో సమీప బంధువులే హత్య చేశారు.
కడప : పాత కక్షలు ఒక్కసారిగా భగ్గుమనడంతో షేక్ గౌస్పీర్(62) దారుణ హత్యకు గురయ్యాడు. భూతగాదా నేపధ్యంలో సమీప బంధువులే హత్య చేశారు. స్థానికులు, ఎస్ ఐ అరుణ్ రెడ్డి కథనం మేరకు వివరాల్లోకెళితే.... మునిపాక వా సి షేక్ గౌస్పీర్ అదే గ్రామస్తు డు, చెల్లెలి భర్త నాయబ్ రసూల్ కుటుంబానికి కొంత కాలంగా భూతగాదా, కుటుంబ కలహాలు వుండేవి. షేక్ గౌస్పీర్, అతని కుమారుడు షేక్ మహమ్మద్ ఓవైసి తనపొలంలో కంప చెట్లను తొలగిస్తుండగా నాయబ్ రసూల్, బషిరూన్, నయీంతుల్లా, ఖాసింపీర కర్రలు, మచ్చుకత్తులతో దాడిచేశారు.
ఈ దాడిలో షేక్ గౌస్పీర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. మృతుడి కుమారుడు మహమ్మద్ ఓవైసిపై కూడా దాడికి ప్రయత్నించగా అతను అక్కడి నుంచి పారిపోయాడు. మహమ్మద్ ఓవైసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గౌస్పీర్పై దాడి జరిగిన స్థలాన్ని మైదుకూరు డీఎస్పీ విజయ్ కుమార్, సీఐ కొండారెడ్డి, ఎస్ఐ అరుణ్ రెడ్డి పరిశీలించారు.