పరువు కోసమే హేమంత్‌ను చంపేశాం: నిందితుడు లక్ష్మారెడ్డి

ABN , First Publish Date - 2020-10-01T01:40:50+05:30 IST

పరువు కోసమే హేమంత్‌ను చంపేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు లక్ష్మారెడ్డి తెలిపాడు. హేమంత్ హత్య కేసులో నిందితుల తొలిరోజు పోలీస్

పరువు కోసమే హేమంత్‌ను చంపేశాం: నిందితుడు లక్ష్మారెడ్డి

హైదరాబాద్: పరువు కోసమే హేమంత్‌ను చంపేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు లక్ష్మారెడ్డి తెలిపాడు. హేమంత్ హత్య కేసులో నిందితుల తొలిరోజు పోలీస్ కస్టడీ ముగిసింది. విచారణలో హత్యకు గల కారణాలను నిందితుడు లక్ష్మారెడ్డి వెల్లడించాడు. ‘అవంతి ప్రేమ విషయం తెలిసి కట్టడి చేశాం. మా నుంచి తప్పించుకుని హేమంత్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్నట్లు మాకు పోలీసుల నుంచి సమాచారం వచ్చింది. 15 సంవత్సరాలుగా బావమ్మర్ధి యుగంధర్‌తో మాటలు లేవు. హేమంత్, అవంతి విషయంపై తిరిగి మాట్లాడాల్సి వచ్చింది. ప్రాణం కంటే పరువే ముఖ్యమని భావించే కుటుంబం మాది. మేము ఉంటున్న కాలనీలో మా కుటుంబానిదే అధిపత్యం. అవంతి ప్రేమ విషయంతో కాలనీలో తలదించుకోవాల్సి వచ్చింది’ అని పోలీసుల విచారణలో లక్ష్మారెడ్డి స్పష్టం చేశాడు.


ఇదిలా ఉంటే ఇవాళ సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను అవంతి, హేమంత్ తల్లిదండ్రులు కలిశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చందానగర్ పోలీసులతో రక్షణ కల్పించనున్నట్లు సీపీ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.


Updated Date - 2020-10-01T01:40:50+05:30 IST