Murder Case: కడప జిల్లా, మైదుకూరు మండ‌లంలో దారుణం

ABN , First Publish Date - 2022-07-28T16:37:51+05:30 IST

కడప జిల్లా మైదుకూరు మండ‌లం, సోమయాజుల ప‌ల్లెలో దారుణం జరిగింది.

Murder Case: కడప జిల్లా, మైదుకూరు మండ‌లంలో దారుణం

కడప జిల్లా (Kadapa dist.): మైదుకూరు మండ‌లం, సోమయాజుల ప‌ల్లెలో దారుణం జరిగింది. భార‌తీ అనే మ‌హిళను ప్రియుడు దారుణంగా హ‌త్య (Murder) చేశాడు. ఈ ఘటన జరిగి వారం రోజులయింది. నెల రోజుల క్రితమే భార‌తికి వివాహం జరిగింది. ఆశాఢమాసంలో ఆమె పుట్టింటికి వ‌చ్చింది. ఈ నేపథ్యంలో భార‌తి (Bharathi)ని ప్రియుడు గోపాల్ (Gopal) బయటకు తీసుకెళ్ళి హత్య చేశాడు. భారతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా న‌మోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుమానంతో ప్రియుడు గోపాల్‌ను విచారించ‌గా అతనే హ‌త్య‌చేసిన‌ట్లు నిర్ధారించారు. మైదుకూరు పరిధి, అటవీప్రాంతంలోని ఎడ్డోడు క‌నుమలో 25వ కిలో మీట‌రు స‌మీపంలో భారతి మృత‌దేహం కుళ్ళి, గుర్తుప‌ట్ట‌లేని స్థితిలో ఉంది. దీంతో మృత‌దేహానికి సంఘటనా స్ధలంలోనే పోస్టు మార్టం నిర్వహించారు. కుమార్తె శవాన్ని భుజాన మోసుకువచ్చిన తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా భార‌తి బంగారు న‌గ‌ల‌ను ప్రియుడు గోపాల్ బ్యాంకులో తాక‌ట్టుపెట్టాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-07-28T16:37:51+05:30 IST