రూ.200ల కోసం కడతేర్చాడు..
ABN , First Publish Date - 2020-09-13T12:42:53+05:30 IST
రెండు వంద ల రూపాయల కోసం యువకుడిని దారుణంగా పొడిచి చంపాడు ఓ ప్రబుద్ధుడు. కృష్ణానగర్లో శుక్రవారం ...
కృష్ణానగర్ హత్య కేసులో విచారణ ముమ్మరం..
హైదరాబాద్, బంజారాహిల్స్ (ఆంధ్రజ్యోతి): రెండు వంద ల రూపాయల కోసం యువకుడిని దారుణంగా పొడిచి చంపాడు ఓ ప్రబుద్ధుడు. కృష్ణానగర్లో శుక్రవారం రాత్రి జరిగిన హత్య కేసు విచారణను జూబ్లీహిల్స్ పోలీసులు ముమ్మరం చేశారు. మృతుడు వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన రాజేష్(25)గా గుర్తించారు. సినీ షూటింగ్ సెట్టింగ్లలో వెల్డర్గా పనిచేసే రాజేష్ వచ్చిన జీతం తో మద్యం తాగి ఫుట్పాత్లపై పడుకుంటుంటాడు. కొన్నిసార్లు లక్ష్మీనర్సింహనగర్లో నివసించే స్నేహితుల వద్దకు వెళ్తుంటాడు. నాలుగు రోజుల క్రితం రూంలోని గ్యాస్ సిలిండర్ అయిపోవడంతో రాజేష్ ముజర్ అనే వ్యక్తి దగ్గర సిలిండర్ తీసుకుని రెండు వందల రూపాయలు తక్కువగా ఇచ్చాడు.
ముజర్ డబ్బు ఎప్పుడు అడిగినా రాజేష్ తప్పించుకునే ధోరణితో వ్యవహరించాడు. దీంతో ముజర్ కోపం పెంచుకున్నాడు. శుక్రవారం రాజేష్ ఇందిరానగర్లో మద్యం తాగుతున్నాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ముజర్ అక్కడికి రాగా డబ్బు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ముజర్ తనతో తెచుకున్న కత్తితో రాజేష్ను పొడిచాడు. అక్కడి నుంచి తప్పించుకున్న రాజేష్ కృష్ణానగర్ మెట్రో పిల్లర్ వద్ద కుప్పకూలి అక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ముజర్తో పాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.