జంట హత్యల కేసులో 8మంది అరెస్టు
ABN , First Publish Date - 2021-05-19T05:51:21+05:30 IST
మండలంలోని ముట్లూరు బీసీ కాలనీ ఆంజనేయస్వామి ఆలయం వెనుక ఈ నెల 13వ తేదీన జరిగిన జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడు నాగరాజుతో పాటు అందులో పాల్గొన్న మరో 7మందిని మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచినట్లు సౌత్ జోన్ డీఎస్పీ ప్రశాంతి తెలిపారు.
వట్టిచెరుకూరు, మే 18: మండలంలోని ముట్లూరు బీసీ కాలనీ ఆంజనేయస్వామి ఆలయం వెనుక ఈ నెల 13వ తేదీన జరిగిన జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడు నాగరాజుతో పాటు అందులో పాల్గొన్న మరో 7మందిని మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచినట్లు సౌత్ జోన్ డీఎస్పీ ప్రశాంతి తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హత్యకు గురైన కుంచాల వెంకట్రావుకు నాలుగేళ్లుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందన్నారు. దీనిపై కక్ష పెంచుకుని నిందితులు ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ హత్య కేసును ఛేదించిన చేబ్రోలు సీఐ మధుసూదనరావు, వట్టిచెరుకూరు ఎస్ఐ శివకృష్ణారెడ్డి, పీఎస్ఐ వినోద్బాబు, కానిస్టేబుల్లు సుభాని, రాము, శ్రీనివాసరావు, రామచంద్రరెడ్డిని, అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించినట్లు ఆమె తెలిపారు.