మండుతున్న చితి నుంచి మహిళ మృతదేహం వెలికితీత... కారణమిదే!
ABN , First Publish Date - 2021-03-02T12:16:58+05:30 IST
యూపీలోని సహరన్పూర్ జిల్లాలోని సబదల్పూర్కు చెందిన ఒక కుటుంబం...
సహరన్పూర్: యూపీలోని సహరన్పూర్ జిల్లాలోని సబదల్పూర్కు చెందిన ఒక కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు మండుతున్న చితి నుంచి మహిళ మృతదేహాన్ని బయటకు తీసి, దానిని పోస్టుమార్టంనకు పంపించారు. తమ బిడ్డను అత్తింటివారే హత్య చేసి, రహస్యంగా దహనం చేశారని మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సబదల్పూర్ నివాసి లక్ష్మి అనే మహిళకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆదివారం ఆమె కన్నుమూయడంతో అత్తింటివారు ఆమెకు రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు వెంటనే అమె అత్తింటివారిపై కుతుబ్షేర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మండుతున్న చితి నుంచి ఆ మహిళ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంనకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి భర్త, అత్తామామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.