యువకుడి దారుణ హత్య

ABN , First Publish Date - 2021-01-27T06:06:17+05:30 IST

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని వెంగళాపూర్‌ గ్రామ రెవెన్యూ శివారులోని పంటపొలంలో మంగళవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

యువకుడి దారుణ హత్య
పొలంలో పడి ఉన్న మృతదేహం

గొల్లపల్లి, జనవరి 26 : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని వెంగళాపూర్‌ గ్రామ రెవెన్యూ శివారులోని పంటపొలంలో మంగళవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..నెల్లూర్‌ జిల్లా వింజమూర్‌ గ్రామానికి చెందిన షేక్‌ ఇలాయాస్‌ భాషా (32) అనే యువకుడు కొన్నేళ్ల క్రితం జగిత్యాల రూరల్‌ మండలం లక్ష్మీ పూర్‌ గ్రామానికి  వలసవచ్చి తాపీమెస్త్రీగా పనిచేస్తున్నాడు. భాషా గ్రామానికి చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. భాషా ఇటీవలే బుగ్గారం మండలం యశ్వంత్‌రావుపేటకు మకాం మార్చాడు. ఎప్పటిమాదిరి పనులు ముగించుకుని సాయంత్రం వెంగళాపూర్‌ మీదుగా తన బైక్‌పై ఇంటివైపు బయలు దేరాడు. ఈ క్రమంలో గ్రామ రెవెన్యూ శివారులోని అనిల్‌ రెడ్డి అనే రైతు పొలం వద్ద గుర్తు తెలియని దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు గమనించి ఎస్సై జీవన్‌కు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేపట్టారు. 





Updated Date - 2021-01-27T06:06:17+05:30 IST