మురళీమోహన్‌కు హైకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2021-08-04T21:27:30+05:30 IST

సినీనటుడు మురళీమోహన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. తన దగ్గర స్థలం తీసుకుని మోసం చేశారంటూ..

మురళీమోహన్‌కు హైకోర్టులో ఊరట

అమరావతి: సినీనటుడు మురళీమోహన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. తన దగ్గర స్థలం తీసుకుని మోసం చేశారంటూ.. భూ యజమాని ఫిర్యాదు మేరకు ఎపీ సీఐడీ కేసు నమోదు చేసింది. 41 ఏ సెక్షన్ కింద నోటీసులిచ్చి గురువారం విచారణకు హాజరు కావాలని సీఐడీ పేర్కొంది. అయితే సీఐడీ నోటీసులపై హైకోర్టులో మురళీమోహన్, కుటుంబ సభ్యులు క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ వేసి సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. సివిల్ వివాదాన్ని క్రిమినల్ వివాదంగా మార్చడంపై న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఒప్పందాన్ని జయభేరి ప్రాపర్టీస్ ఉల్లంఘించలేదని దమ్మాలపాటి కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులో అన్ని రకాల తదనంతర చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2021-08-04T21:27:30+05:30 IST