Hyderabad: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు
ABN , First Publish Date - 2022-10-07T17:52:03+05:30 IST
మునుగోడు(MunuGodu) టీఆర్ఎస్ (TRS) అభ్యర్థిని(candidate) సీఎం కేసీఆర్ (cm kcr) ప్రకటించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి
హైదరాబాద్: మునుగోడు(MunuGodu) టీఆర్ఎస్ (TRS) అభ్యర్థిని(candidate) సీఎం కేసీఆర్ (cm kcr) ప్రకటించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి(Koosukuntla Prabhakar Reddy) బరిలోకి దిగనున్నారు. 2014లో మునుగోడు ఎమ్మెల్యేగా(MLA) కూసుకుంట్ల గెలిచారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి(Rajagopal Reddy) చేతిలో ఓటమి పాలయ్యారు. మునుగోడులో 70 శాతానికిపైగా బీసీ ఓటర్లు ఉన్నారు. దీంతో సర్వేల ఆధారంగా కూసుకుంట్ల వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఉన్న కూసుకుంట్ల..ఈనెల 10న నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్కు మంత్రులు కేటీఆర్, హరీష్రావు, జగదీష్రెడ్డి హాజరుకానున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి రాజగోపాల్రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు.