Mlc Jeevan Reddy: మునుగోడు మాదే

ABN , First Publish Date - 2022-08-09T23:44:03+05:30 IST

మునుగోడు (Munugodu) సీటు తమదేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Mlc Jeevan Reddy) అన్నారు. మునుగోడులో బీజేపీ (Bjp)కి...

Mlc Jeevan Reddy: మునుగోడు మాదే

కరీంనగర్: మునుగోడు (Munugodu) సీటు తమదేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Mlc Jeevan Reddy) అన్నారు. మునుగోడులో బీజేపీ (Bjp)కి ఓటు అడిగే హక్కు లేదన్నారు.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఎందుకు రాజీనామా చేశారో ఆయనకే తెలియదన్నారు. తెలంగాణ (Telangana) ఏర్పాటును కించపరిచేలా ప్రధాని మోదీ మాట్లాడారని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ, టీఆరెస్ (Trs) తోడు దొంగలేనని ఎద్దేవా చేశారు. మునుగోడు అంతా పొలిటికల్ గేమ్ (Political Game) అని.. రెండో స్థానంలో ఎవరుంటారో బీజేపీ, టీఆరెస్ తేల్చుకోవాలని జీవన్ రెడ్డి ఓ ప్రకటనలో సూచించారు. 


కాగా కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ పోచారం ఆమోదించారు. ఈ మేరకు మునుగోడు నియోజకవర్గంలో ఉప ఉన్నిక అనివార్యమైంది. దీంతో అన్ని పార్టీలు మునుగోడును దక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరికి వాళ్లు మునుగోడును తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. 


Updated Date - 2022-08-09T23:44:03+05:30 IST