Munugode By-election: మునుగోడులో కాషాయ జెండా ఎగురుతుంది: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-08-17T22:27:28+05:30 IST

మునుగోడు (Munugode)లో కాషాయ జెండా ఎగురుతుందని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) ధీమా వ్యక్తం చేశారు.

Munugode By-election: మునుగోడులో కాషాయ జెండా ఎగురుతుంది: బండి సంజయ్

జనగామ: మునుగోడు (Munugode)లో కాషాయ జెండా ఎగురుతుందని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవర్టు రాజకీయాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ (Telangana) ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రజలపై నమ్మకంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) రాజీనామాతో మునుగోడుకు నిధులు విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ప్రాజెక్టులు ఏమయ్యాయి సీఎం కేసీఆర్ (CM KCR)? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మునిగిపోయే నావా అని బండి సంజయ్ ఎద్దేవాచేశారు.


ప్రధాన పార్టీలతో పాటు చిన్నచిన్న పార్టీలు సైతం మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో నియోజకవర్గంలో సందడి మొదలైంది. మేం అంటే మేం అంటూ పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. బీజేపీలో ఈనెల 21న చేరేందుకు నిర్ణయించుకోవడం, అదేరోజు మునుగోడులో అమిత్‌షా సభ, భారీగా చేరికల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో  రాజగోపాల్‌రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతీ మండలంలోని కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులతో భేటీ అవుతూ వారితో కలిసి మీడియాతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లపై ప్రజాప్రతినిధుల సమక్షంలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై కుట్రలు చేస్తున్నారని, అమ్ముడు పోయినట్లు రుజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమని, అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని, రాష్ట్రంలో కుటుంబ పాలన అంతమొందించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ, అమిత్‌షాతోనే సాధ్యమని, మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వనున్నారంటూ ఆయన ప్రచారం చేస్తున్నారు.

Updated Date - 2022-08-17T22:27:28+05:30 IST