APలో కొనసాగుతున్న మున్సిపల్ వర్కర్ల సమ్మె

ABN , First Publish Date - 2022-07-15T15:35:35+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్ల సమ్మె కొనసాగుతోంది. సమ్మెకు ప్రజా, కార్మిక, వామపక్ష సంఘాల నాయకుల మద్దతు తెలిపాయి.

APలో కొనసాగుతున్న మున్సిపల్ వర్కర్ల సమ్మె

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్ల సమ్మె కొనసాగుతోంది. సమ్మెకు ప్రజా, కార్మిక, వామపక్ష సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. జగన్ ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ కార్మికులు వినూత్నరీతిలో నిరసనలు చేపట్టారు. కాగా... ఆందోళనలు అడ్డుకునేందుకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అనుమతి లేదనే సాకుతో  పోలీసులు రంగంలోకి దిగారు. వామపక్ష, కార్మిక సంఘాల నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. విజయవాడలో సీపీఎం నాయకులు బాబూరావు, కాశీనాథ్, మున్సిపల్ కార్మిక సంఘం, సీఐటీయూ నేతలు డేవిడ్, జ్యోతిబాసులను ఇళ్ల నుండి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. జగన్ ఇచ్చిన హామీని అమలు చేసే వరకు సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. 

Updated Date - 2022-07-15T15:35:35+05:30 IST