మున్సిపల్ కార్మికుల సమ్మె బాట
ABN , First Publish Date - 2021-06-15T05:05:14+05:30 IST
మున్సిపల్ ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం మున్సిపల్ కార్మికులు స్థానిక మున్సిపల్ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు.
బద్వేలు, జూన్ 14: మున్సిపల్ ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం మున్సిపల్ కార్మికులు స్థానిక మున్సిపల్ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. సమ్మె కు ప్రజా సంఘాలు తమ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగేంద్రబాబు మాట్లాడుతూ మున్సిపల్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, బకాయి ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని తదితర డిమాండ్లు చేశారు. సీఐటీయూ పట్టణ నేత షేక్ ఖాదర్ హుసేన్, డీవైఎ్ఫఐ నేత ప్రవీణ్, కేవీపీఎస్ పట్టణ కార్యదర్శి గిలకరాజు, చాంద్బాష తదితరులు పాల్గొన్నారు.