మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-04-10T05:39:29+05:30 IST
పెండింగ్లో ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాచేశారు.
పెద్ద బజార్, ఏప్రిల్ 9: పెండింగ్లో ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాచేశారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఓమయ్య మాట్లాడుతూ.. కార్పొరేషన్పరిధిలో పనిచేస్తున్న పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, అందరికీ పనిముట్లు, చీపుర్లు, వార్డు కార్యాలయాల వద్దనే హాజరు కొనసాగించాలని, పెండింగ్లో ఉన్న నూనె, సబ్బులు ఇవ్వాలని అన్నారు. కార్మికులకు ఇవ్వాల్సిన బట్టల కుట్టు కూలీ ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న ఏరియర్స్, పెంచిన వేతలను ఇవ్వాలని కోరారు. మున్సిపల్ కార్మికులకు కరోనా నుంచి కాపాడడానికి మాస్క్లు, శానిటైజర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నేతలు నర్సింగ్రావు, పి.సుధాకర్, చిన్నుబాయి, సావిత్రి, నరసమ్మ, కె.మల్లేష్, రాజశేఖర్, భిక్షఫతి తదితరులున్నారు.