సమ్మెకు మద్దతుగా మునిసిపల్ కార్మికుల ధర్నా
ABN , First Publish Date - 2022-01-25T08:44:34+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనలకు రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ కార్మికులు మద్దతు ప్రకటిస్తున్నారని ఎఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంధ్రనాథ్ తెలిపారు.
విజయవాడ(అజిత్సింగ్నగర్), జనవరి 24: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనలకు రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ కార్మికులు మద్దతు ప్రకటిస్తున్నారని ఎఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంధ్రనాథ్ తెలిపారు. ఫిబ్రవరి ఏడు నుంచి ఉద్యోగ సంఘాలు తలపెట్టిన సమ్మెలోను కార్మికులు భాగస్వాములవుతారని చెప్పారు. ఎఐటీయూసీ అనుబంధ ఏపీ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యాన అజిత్సింగ్నగర్ శానిటరీ కార్యాలయం వద్ద సోమవారం కార్మికులు సామూహిక ధర్నా చేపట్టారు. మునిసిపల్ రంగంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని ఉద్యోగ సంఘాల జేఏసీ సమన్వయంతో ఆందోళనలు ఉధృతం చేస్తామని రవీంద్రనాథ్ చెప్పారు.