సూర్యాపేట మున్సిపల్ సమావేశంలో రసాభాస

ABN , First Publish Date - 2021-08-31T19:08:04+05:30 IST

సూర్యాపేట: మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది.

సూర్యాపేట మున్సిపల్ సమావేశంలో రసాభాస

సూర్యాపేట: మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్ సమావేశానికి హాజరయ్యారు. అధికార పార్టీ కౌన్సిలర్ల వార్డుల్లో అధిక నిధులు కేటాయించి.. తమపై వివక్ష చూపుతున్నారంటూ ఛైర్మన్ పొడియం ముందు ప్రతిపక్ష కౌన్సిలర్లు బైఠాయించారు. తన వార్డుకు తక్కువ నిధులు కేటాయించి అవమానించారంటూ 12వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ శ్రీను చెప్పుతో కొట్టుకోబోయారు.

Updated Date - 2021-08-31T19:08:04+05:30 IST