మున్సిపల్ కార్మికుల సమ్మె నోటీసు
ABN , First Publish Date - 2022-06-24T03:58:32+05:30 IST
పెండింగ్ సమస్యల పరిష్కారానికి సీఐటీయూ అనుబంధ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు గురువారం మున్సిపల్ కార్యాలయంలో క
కావలి, జూన్23: పెండింగ్ సమస్యల పరిష్కారానికి సీఐటీయూ అనుబంధ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు గురువారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ బీ. శివారెడ్డికి సమ్మె నోటీసును అందచేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ గౌవరాధ్యక్షుడు పీ. పెంచలయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేస్త్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని, స్కూల్ స్వీపర్లకు, ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు నెలకు రూ.20 వేల వేతనంతోపాటు కరువు భత్యం చెల్లించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనందరావు, టీ. మాలకొండయ్య, తురక శీనయ్య, వై. కృష్ణమోహన్, జీ. మధుసూదనరావు, ఆదిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.