‘మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీని ఓడించండి’

ABN , First Publish Date - 2021-03-08T05:46:28+05:30 IST

ఈ నెల 10వ తేదీన జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో అరాచక పార్టీ వైసీపీని చిత్తుగా ఓడించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు.

‘మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీని ఓడించండి’

రాజమహేంద్రవరం అర్బన్‌, మార్చి 7: ఈ నెల 10వ తేదీన జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో అరాచక పార్టీ వైసీపీని చిత్తుగా ఓడించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. ఆదివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో అపరాల సెక్షన్‌ జట్ల మహాసభ జరిగింది. సప్ప రమణ అధ్యక్షతన జరిగిన సభలో మధు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో పాత్రికేయులను వైసీపీ నాయకులు బెదిరించడం దారుణమని, రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ఫ్యాక్షనిస్ట్‌ రాజకీయాలను సీపీఐ సహించదని పేర్కొన్నారు. జగన్‌ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. నిరుద్యోగం పెరిగిందని, ఇసుక, మట్టి వంటివన్నీ దోచేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు, సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు, మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకర చౌదరి, జట్ల లేబర్‌ యూనియన్‌ అధ్యక్షుడు కె.రాంబాబు, వంగమూడి కొండలరావు, బొమ్మసాని రవిచంద్ర, పెంట దేవుడు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-08T05:46:28+05:30 IST