వివాదాల్లో భువనగిరి మునిసిపల్‌ కౌన్సిలర్లు

ABN , First Publish Date - 2022-01-19T05:16:55+05:30 IST

ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన భువనగిరి మునిసిపల్‌ కౌన్సిలర్లు వివాదాల్లో కూరుకుపోతున్నారు.

వివాదాల్లో భువనగిరి మునిసిపల్‌ కౌన్సిలర్లు
11వ వార్డు కౌన్సిలర్‌ ఇంటి ముందు బైఠాయించిన కుటుంబ సభ్యులు

భువనగిరి టౌన్‌, జనవరి 18 :  ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన భువనగిరి మునిసిపల్‌ కౌన్సిలర్లు వివాదాల్లో కూరుకుపోతున్నారు. 11వ వార్డు కౌన్సిలర్‌ జిట్ట వేణుగోపాల్‌రెడ్డి ఇంటి ముందు మంగళవారం ఉమ్మడి కుటుంబసభ్యులు బైఠాయించారు. ఇప్పటికే పోలీసులను ఆశ్రయించిన కుటుంబసభ్యులు కౌన్సిలర్‌ ఇంటి ముందు బైఠాయించి నినాదాలు చేశారు. అలాగే 18వ వార్డు కౌన్సిలర్‌ అందె శంకర్‌పై చర్యలు తీసుకోవాలంటూ మెప్మా ఆర్పీ సరిత హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంటి ఎదుట మంగళవారం ఉదయం ఆందోళనకు దిగింది. దీంతో నాయకులు ఆమెను సముదాయించి ఆందోళనను విరమించేలా చేశారు. తమపై ఆరోపణలు అసత్యమని, తమ ప్రగతిని ఓర్వలేక విపక్షాలు చేస్తున్న కుట్రలో భాగమే ఆందోళనలని ఆ ఇద్దరు కౌన్సిలర్లు తెలిపారు. 


Updated Date - 2022-01-19T05:16:55+05:30 IST