పలాసలో ‘మున్సిపల్’ కలకలం
ABN , First Publish Date - 2021-02-28T08:45:26+05:30 IST
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో రాజకీయం వేడెక్కుతోంది. మరో నాలుగు రోజుల్లో మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరగనుండగా టీడీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్ అభ్యర్థులు
వైసీపీలో చేరిన నలుగురు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులు
పలాస, ఫిబ్రవరి 27: శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో రాజకీయం వేడెక్కుతోంది. మరో నాలుగు రోజుల్లో మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరగనుండగా టీడీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్ అభ్యర్థులు వాయిలపల్లి శ్రీనివా్స(లక్ష్మణ్), రోణంకి మురళీకృష్ణ, బమ్మిడి వెంకటలక్ష్మి, సనపల దీప్తి శనివారం మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలో వైసీపీలో చేరారు. దీంతో టీడీపీ నాయకులు మిగిలిన అభ్యర్థులను రహస్య ప్రదేశాలకు తరలించారు. టీడీపీ నేతలు గౌతు శిరీష, గౌతు శ్యామసుందరశివాజీ విలేకర్లతో మాట్లాడుతూ వైసీపీ నేతలు తమ అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేసి లాక్కెళ్లారని ఆరోపించారు.