మున్సిపల్ కమిషనర్పై చర్యలకు ధర్నా
ABN , First Publish Date - 2022-07-07T02:58:38+05:30 IST
వ్యాంగుడైన మాజీ కౌన్సిలర్ను కించపరిచిన మున్సిపల్ కమిషనర్ శివారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ ది
కావలిటౌన్, జూలై6: దివ్యాంగుడైన మాజీ కౌన్సిలర్ను కించపరిచిన మున్సిపల్ కమిషనర్ శివారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండవ వెంకట్రావు డిమాండ్ చేశారు. బుధవారం ట్రంకురోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద దివ్యాంగులు ధర్నా నిర్వహించారు. మండవ మాట్లాడుతూ రెండుసార్లు కౌన్సిలర్గా పనిచేసిన ఇనాయత్ హుస్సేన్ను నోర్మూసుకో...అని మున్సిపల్ కమిషనర్ బెదిరించడం తగదన్నారు. ఆయనపై కేసు నమోదుచేసి చర్యలు తీసుకో వాలని, లేకుంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ దివ్యాంగుల విభాగం ఉపాధ్యక్షుడు బొల్లా వేణు, బాష తదితరులు పాల్గొన్నారు.