మానవత్వం చాటుకున్న పోలీసులు
ABN , First Publish Date - 2021-09-18T03:53:44+05:30 IST
ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో మతిస్థిమితం లేని ఓ యువతిని ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులు అక్కున చేర్చుకుని ఆమెను వైద్యం నిమిత్తం కావలి సమీపంలోని ముంగమూరు హోమ్కు శుక్రవారం తరలించారు.
కావలి, సెప్టెంబరు 17: ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో మతిస్థిమితం లేని ఓ యువతిని ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులు అక్కున చేర్చుకుని ఆమెను వైద్యం నిమిత్తం కావలి సమీపంలోని ముంగమూరు హోమ్కు శుక్రవారం తరలించారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో మతి స్థిమితం లేకుండా కొన్నిరోజులుగా ఆ యువతి ఉండటంతో వన్టౌన్ సీఐ సుభాషిణి ఆదేశాల మేరకు ఆమెను ముంగమూరు హోమ్కు తరలించి ఆ హోమ్ నిర్వహకుడు సింహాద్రికి అప్పగించారు.