మానవత్వం చాటుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-09-18T03:53:44+05:30 IST

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో మతిస్థిమితం లేని ఓ యువతిని ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులు అక్కున చేర్చుకుని ఆమెను వైద్యం నిమిత్తం కావలి సమీపంలోని ముంగమూరు హోమ్‌కు శుక్రవారం తరలించారు.

మానవత్వం చాటుకున్న పోలీసులు
మతిస్థిమితం లేని యువతిని ముంగమూరు ఆదరణ కేంద్రం నిర్వహుకుడు సింహాద్రికి అప్పగిస్తున్న పోలీసులు

కావలి, సెప్టెంబరు 17: ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో మతిస్థిమితం లేని ఓ యువతిని ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులు అక్కున చేర్చుకుని ఆమెను వైద్యం నిమిత్తం కావలి సమీపంలోని ముంగమూరు హోమ్‌కు శుక్రవారం తరలించారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో మతి స్థిమితం లేకుండా కొన్నిరోజులుగా ఆ యువతి ఉండటంతో వన్‌టౌన్‌ సీఐ సుభాషిణి ఆదేశాల మేరకు ఆమెను ముంగమూరు హోమ్‌కు తరలించి ఆ హోమ్‌ నిర్వహకుడు సింహాద్రికి అప్పగించారు.

Updated Date - 2021-09-18T03:53:44+05:30 IST