అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు
ABN , First Publish Date - 2020-11-29T06:12:43+05:30 IST
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఆదిలాబాద్ పట్టణం ఎంతో అభివృద్ధి సాధించిందని, ఈ సారి కూడా అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు అన్నివిధాల చర్యలు తీసుకుంటామ ని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
సాదాసీదాగా మున్సిపల్ సర్వసభ్య సమావేశం
సమస్యలను చైర్మన్ దృష్టికి తెచ్చిన సభ్యులు
ఆదిలాబాద్ టౌన్, నవంబరు 28: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఆదిలాబాద్ పట్టణం ఎంతో అభివృద్ధి సాధించిందని, ఈ సారి కూడా అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు అన్నివిధాల చర్యలు తీసుకుంటామ ని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిప ల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువు రు సభ్యులు ఆయా వార్డుల్లోని సమస్యలను చైర్మన్ దృష్టికి తెచ్చారు. మరికొందరు తమ వార్డుల్లో సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కోరగా, ప్రతిపక్ష పార్టీల సభ్యులు సైతం తమ కాలనీల్లో సమస్యలు పేరుకు పోయి ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేయాలన్నా రు. ఇందుకు స్పందించిన మున్సిపల్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పార్టీలకతీతంగా అందరి వార్డుల్లో అన్ని రకాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నూతన పనులను సైతం చేపడుతామని రోడ్లు, డ్రైనేజిలు, కల్వర్టుల నిర్మాణం చేస్తామన్నారు. 49వార్డుల్లోని సభ్యుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇందులో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు బండారి సతీష్, పవన్ నాయక్, అర్చన, ఉష్కం రఘుపతి, సాయి, డా.లక్ష్మణ్, ఆవుల వెంకన్న, బడాల సుజాతరెడ్డి, కలాల శ్రీనివాస్, భరత్, తదితరులు పాల్గొన్నారు.