నాటక రంగానికి జీవం పోస్తున్న మునగపాక

ABN , First Publish Date - 2022-08-14T06:07:36+05:30 IST

మునగపాకలోని గ్రామీణ యువజన మందిరం నిర్వాహకులు నాటక రంగానికి జీవం పోస్తున్నారని టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు అన్నారు.

నాటక రంగానికి జీవం పోస్తున్న మునగపాక
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ప్రగడ నాగేశ్వరరావు

టీడీపీ నేత ప్రగడ నాగేశ్వరరావు

రాష్ట్రస్థాయి నాటిక పోటీలు ప్రారంభం

మునగపాక, ఆగస్టు 13: మునగపాకలోని గ్రామీణ యువజన మందిరం నిర్వాహకులు నాటక రంగానికి జీవం పోస్తున్నారని టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గ  ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. మునగపాక గ్రామీణ యువజన మందిరం 58వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే రాష్ట్రస్థాయి నాటిక పరిషత్‌ పోటీలను శనివారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, మునగపాకకు చెందిన ఎందరో కళాకారులు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారన్నారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ, నాటకాలకు ఆదరణ తగ్గలేదని చెప్పడానికి ఈ పరిషత్‌ ఒక ఉదాహరణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన మందిరం కార్యదర్శి పీలా వెంకటఅప్పారావు, ఉపాధ్యక్షుడు మళ్ల కృష్ణ, నాయకులు దాడి ముసిలినాయుడు, దొడ్డి శ్రీనివాసరావు, కోనపల్లి రామ్మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T06:07:36+05:30 IST