ముంపులో వరినాట్లు

ABN , First Publish Date - 2022-08-07T06:38:50+05:30 IST

ముంపులో వరినాట్లు

ముంపులో వరినాట్లు

తోట్లవల్లూరు, ఆగస్టు 6 : తోట్లవల్లూరు బాడవలో వరినాట్లు ముంపునకు గురయ్యాయి. శుక్రవారం కురిసిన కుండపోత వర్షానికి ఎగువ నుంచి భారీగా మురుగు వచ్చి చేరటంతో సుమారు 150 ఎకరాల్లో వరినాట్లు ముంపులో చిక్కుని దెబ్బతినే పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులకోడు డ్రెయిన్‌ ప్రక్కనే ఈ బాడవ పొలాలు ఉన్నప్పటికీ మురుగు అందులోకి వెళ్లే మార్గం లేకుండా ఉందని రైతులు చెబుతున్నారు. కట్టను ఆనుకుని పొలం ఉన్న ఓ రైతు మాత్రం ఏనుగులకోడు డ్రెయిన్‌లోకి మురుగు దిగేందుకు రంధ్రాన్ని ఏర్పాటు చేశారు.  

Updated Date - 2022-08-07T06:38:50+05:30 IST