ఇంటి పనిలో జాప్యం చేసిందని పని అమ్మాయిని యజమానురాలు ఏం చేసిందంటే...

ABN , First Publish Date - 2021-12-13T13:59:43+05:30 IST

ఇంటి పనిలో జాప్యం చేసిందనే కోపంతో యజమానురాలు దారుణానికి పాల్పడిన ఘటన...

ఇంటి పనిలో జాప్యం చేసిందని పని అమ్మాయిని యజమానురాలు ఏం చేసిందంటే...

ముంబై : ఇంటి పనిలో జాప్యం చేసిందనే కోపంతో యజమానురాలు దారుణానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగుచూసింది.ముంబైలోని ఓ ఇంట్లో 17 ఏళ్ల పని అమ్మాయి పనిచేసేది. పని అమ్మాయి ఇంటి పనిలో జాప్యం చేసిందని యజమానురాలు ఆగ్రహం చెందింది. పని అమ్మాయి బట్టలను బలవంతంగా తీసేయించి నగ్న వీడియో, చిత్రాలు తీయడంతోపాటు ఆమెను చెప్పుతో పలుమార్లు కొట్టింది.దీంతో పని అమ్మాయి గాయపడటంతో ఆమె ఇంటి నుంచి వెళ్లి పోయింది.పని అమ్మాయి ఇంటికి వెళ్లగా చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. 


గాయం గురించి కుటుంబసభ్యులు అడిగితే యజమానురాలు కొట్టి నగ్నంగా వీడియో తీసిందని చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యజమానురాలిపై ఐపీసీ సెక్షన్ 326,354బి, 504, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. నిందితురాలైన యజమానురాలిని పోలీసులు అరెస్టు చేశారు.  


Updated Date - 2021-12-13T13:59:43+05:30 IST