మురుగు కాలువ పక్కన కూర్చుని అదే పనిగా అరుస్తున్న పిల్లులు.. అటుగా వెళ్తున్న వారికి అనుమానం వచ్చి వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2021-11-18T15:58:38+05:30 IST

విచిత్ర పరిస్థితుల్లో లభ్యమైన ఒక నవజాత శిశువును..

మురుగు కాలువ పక్కన కూర్చుని అదే పనిగా అరుస్తున్న పిల్లులు.. అటుగా వెళ్తున్న వారికి అనుమానం వచ్చి వెళ్లి చూస్తే..

విచిత్ర పరిస్థితుల్లో లభ్యమైన ఒక నవజాత శిశువును కాపాడిన ఉదంతం చోటుచేసుకుంది. ముంబైలోని పంత్‌నగర్ ఫ్రాంతంలో రోజుల వయసున్న శిశువు నాలాలో కనిపించింది. ఈ శిశువును తొలుత అక్కడున్న పిల్లులు గమనించాయి. వెంటనే అవి అరవడం మొదలుపెట్టాయి. దీంతో స్థానికులు ఆ శిశువును గమనించి, పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ శిశువును వెలికితీసి రాజ్వీడీ ఆసుపత్రికి తరలించారు. 




ముంబై పోలీసులు ఈ ఉదంతాన్ని ఒక ట్వీట్ ద్వారా తెలియజేశారు. కాలువలో కనిపించిన శిశువు దుస్తులలో చుట్టివుందని, దీనిని గమనించిన పిల్లలు అరిచాయన్నారు. స్థానికుల సమాచారంతో తాము అక్కడికి చేరుకుని, శిశువును కాపాడగలిగామన్నారు. ప్రస్తుతం ఆ శిశువు ఆరోగ్యంగానే ఉందని తెలిపారు. కాగా ఇప్పటి వరకూ ఆ శిశువు తల్లిదండ్రుల గురించి తెలియలేదు. పోలీసులు దీనికి సంబంధించిన సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. 

Updated Date - 2021-11-18T15:58:38+05:30 IST