15 నుంచి ముంబైలో పట్టాలపైకి లోకల్ రైళ్లు!

ABN , First Publish Date - 2021-08-11T15:39:42+05:30 IST

ముంబై లైఫ్ లైన్‌గా పేరొందిన లోకల్ ట్రైన్...

15 నుంచి ముంబైలో పట్టాలపైకి లోకల్ రైళ్లు!

ముంబై: ముంబై లైఫ్ లైన్‌గా పేరొందిన లోకల్ ట్రైన్ సర్వీస్ ఆగస్టు 15 నుంచి తిరిగి ప్రారంభంకానుంది. కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న ప్రయాణికులు రైలు సేవలను వినియోగించుకోవచ్చు. బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) రైలు సేవలకు సంబంధించి నూతన గైడ్ లైన్స్ విడుదల చేసింది. బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చహల్ దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు. రైల్వే పాసులను ఆన్ లైన్ లేదా ఆఫ్‌లైన్‌లలో తీసుకోవచ్చన్నారు. ఇందుకు సంబంధించి ఈరోజు నుంచి వెరిఫికేషన్ ప్రారంభమవుతుందన్నారు. రెండు డోసుల టీకా వేయించుకున్నవారు సంబంధిత సర్టిఫికెట్‌ను రైల్వే పాస్ కోసం చూపించాల్సి ఉంటుందన్నారు. 

Updated Date - 2021-08-11T15:39:42+05:30 IST