Mumbai Indians all-rounder:తొమ్మిదేళ్ల తర్వాత తల్లిని కలిసిన ఐపీఎల్ స్టార్...ఫొటో వైరల్

ABN , First Publish Date - 2022-08-04T17:55:39+05:30 IST

ముంబయి ఇండియన్స్ ఆల్ రౌండర్(Mumbai Indians all-rounder) కుమార్ కార్తికేయ సింగ్(Kumar Kartikeya Singh) తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో వైరల్‌గా...

Mumbai Indians all-rounder:తొమ్మిదేళ్ల తర్వాత తల్లిని కలిసిన ఐపీఎల్ స్టార్...ఫొటో వైరల్

ముంబయి(మహారాష్ట్ర): ముంబయి ఇండియన్స్ ఆల్ రౌండర్(Mumbai Indians all-rounder) కుమార్ కార్తికేయ సింగ్(Kumar Kartikeya Singh) తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో వైరల్‌గా(Pic Goes Viral) మారింది.తొమ్మిదేళ్ల ( nine Years)తర్వాత తాను తల్లిని కలిశానని(Meets Mother) చెపుతూ తల్లితో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో ముంబయి ఇండియన్స్ స్టార్ కుమార్ కార్తికేయ సింగ్ పోస్టు చేశారు. కొవిడ్ మహమ్మారి వ్యాప్తితోపాటు క్రికెట్ మ్యాచ్‌లు, ప్రాక్టీసుతో బిజీగా గడిపిన కుమార్ కార్తికేయ 9 ఏళ్లు కుటుంబానికి దూరంగా (long stints away from family)ఉన్నారు. 


ఒకే ఫ్యామిలీ(one family), దిల్ ఖోల్ కే (dil kholke), ముంబయి ఇండియన్స్(mumbai indians) హాష్ ట్యాగ్ లతో ముంబయి ఐపీఎల్ ఫ్రాంచైజీ కార్తికేయ తల్లిని కలిసిన చిత్రాన్ని పోస్టు చేసింది. కార్తికేయ ఐపీఎల్ 2022 ముంబయి ఇండియన్స్ జట్టులో నాలుగు మ్యాచ్ లు ఆడారు. ఈయన మూడు పరుగులు చేసి, ఐదు వికెట్లు తీసుకున్నారు. స్పిన్నర్ అయిన కార్తికేయ మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీని(Ranji Trophy-winning team) గెలుచుకున్నారు.ఈ రంజీ ట్రోఫి సీజనులో కార్తికేయ 11 ఇన్నింగుల్లో 32 వికెట్లు తీసుకొని అత్యధిక వికెట్లు తీసిన రెండో క్రికెటరుగా నిలిచాడు. 





‘‘9 ఏళ్ల 3 నెలల తర్వాత నేను నా తల్లిని (ముమ్మా)((mother) కలిశాను...నా తల్లిని కలిసినపుడు నాకు కలిగిన అనుభూతిని నేను వర్ణించలేను’’ అని క్యాప్షన్‌తో కుమార్ కార్తికేయ((Mumbai Indians Star) ట్వీట్ చేశారు. క్రికెట్ స్టార్ పోస్టు చేసిన ఫొటోకు 17వేల మంది క్రికెట్ అభిమానులు లైక్ చేశారు. మరో 900 మంది అభిమానులు రీట్వీట్ చేశారు. కార్తికేయ ఫొటోను ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజ్( IPL franchise Mumbai Indians) కూడా షేర్ చేసింది. ‘‘దీనినే మనం పర్ఫెక్ట్ హోమ్ కమింగ్(perfect home coming) అని అంటాం’’ అనే క్యాప్షన్‌తో ముంబయి ఇండియన్స్ జట్టు పోస్టు చేసింది. 



Updated Date - 2022-08-04T17:55:39+05:30 IST