రాజస్థాన్పై టాస్ గెలిచిన ముంబై.. నేడైనా బోణీ కొట్టేనా?
ABN , First Publish Date - 2022-05-01T00:40:55+05:30 IST
రాజస్థాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
ముంబై: రాజస్థాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ముంబైకి ఇది 9వ మ్యాచ్. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లోనూ ఓడిన ముంబై ఖాతా తెరిచేందుకు నానా పాట్లు పడుతోంది.
ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలు మృగ్యమైన వేళ ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా పరువు కాపాడుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. మరోవైపు, 8 మ్యాచ్లు ఆడి ఆరింటిలో విజయం సాధించిన రాజస్థాన్ ఈ మ్యాచ్లో గెలిస్తే అగ్రస్థానానికి చేరుకుంటుంది.