పట్టుబిగిస్తున్న ఢిల్లీ.. కష్టాల్లో ముంబై

ABN , First Publish Date - 2021-04-21T01:56:31+05:30 IST

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వెంటవెంటనే వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. సూర్యకుమార్ యాదవ్,

పట్టుబిగిస్తున్న ఢిల్లీ.. కష్టాల్లో ముంబై

చెన్నై: ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వెంటవెంటనే వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. సూర్యకుమార్ యాదవ్, రోహిత్, పాండ్యా త్వరత్వరగా పెవిలియన్ చేరారు. దీంతో 77 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. డికాక్ అవుట్ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కుదురుకున్నట్టే కనిపించాడు.


రోహిత్ శర్మ‌కు సహకారం అందిస్తూ స్కోరు బోర్డును వేగంగా ముందుకు కదిలించాడు. 15 బంతుల్లో 4 ఫోర్లతో 24 పరుగులు చేసిన సూర్యకుమార్.. అవేష్ ఖాన్ బౌలింగులో పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోవైపు, క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ రోహిత్ సిక్సర్లు, ఫోర్లు కొడుతూ అర్ధ సెంచరీకి చేరువయ్యాడు.


ఈ క్రమంలో మరో షాట్‌కు యత్నించి అమిత్ మిశ్రా బౌలింగ్‌లో స్మిత్‌కు చిక్కి పెవిలియన్ చేరాడు. 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిశాయి. ముంబై నాలుగు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (0), కృనాల్ పాండ్యా (3) క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2021-04-21T01:56:31+05:30 IST