Mulugu: గోదావరిలో యువకుడు గల్లంతు

ABN , First Publish Date - 2022-03-01T16:02:02+05:30 IST

జిల్లాలోని మంగపేట మండలం కమలాపురంలోని ఇంటెక్ వెల్ గోదావరిలో యువకుడు గల్లంతయ్యాడు.

Mulugu: గోదావరిలో యువకుడు గల్లంతు

ములుగు: జిల్లాలోని మంగపేట మండలం కమలాపురంలోని ఇంటెక్ వెల్ గోదావరిలో యువకుడు గల్లంతయ్యాడు. గ్రామంలోని టీడీపీ కాలనీకి చెందిన భూక్య సాయి(19) మహాశివరాత్రి సందర్భంగా పుణ్య స్నానాలు చేయడానికి గోదావరిలో దిగి గల్లంతయ్యాడు. వెంటనే అప్రమత్తమైన యువకులు, ఈతగాళ్లు.... యువకుని ఆచూకీకోసం గోదావరిలో గాలిస్తున్నారు. విషయం తెలిసిన యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2022-03-01T16:02:02+05:30 IST