Mulugu: మందుబాబులకు అడ్డాగా ప్రభుత్వ పాఠశాల

ABN , First Publish Date - 2022-01-18T17:39:13+05:30 IST

ములుగు మండలం మల్లంపల్లిలో ప్రభుత్వ పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారింది.

Mulugu: మందుబాబులకు అడ్డాగా ప్రభుత్వ పాఠశాల

ములుగు: జిల్లాలోని ములుగు మండలం మల్లంపల్లిలో ప్రభుత్వ పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారింది. మందుబాటిళ్ళతో పాఠశాలలో చొరబడిన దుండగులు మద్యం సేవించి భీభత్సం సృష్టించారు. తరగతి గదుల తలుపులు, కిటికీలు, బేంచీలు, ఫ్యాన్లను ధ్వంసం చేశారు. మందుబాబుల దుశ్చర్యపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించారు. పాఠశాలకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-01-18T17:39:13+05:30 IST