TS news: ఎక్కాలు చెప్పలేదని బాలుడిని చితకబాదిన తండ్రి

ABN , First Publish Date - 2022-08-19T17:59:55+05:30 IST

జిల్లాలోని వెంకటాపురం మండలం శాంతినగర్‌లో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలుడిని కన్న తండ్రే వాతలు పడేలా చితకబాదాడు.

TS news: ఎక్కాలు చెప్పలేదని బాలుడిని చితకబాదిన తండ్రి

ములుగు: జిల్లాలోని వెంకటాపురం మండలం శాంతినగర్‌లో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలుడిని కన్న తండ్రే వాతలు పడేలా చితకబాదాడు. తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేపి ఎక్కాలు అప్పజెప్పమని అడగగా తప్పుపోవడంతో బాలుడిని తండ్రి నారాయణ తీవ్రంగా కొట్టాడు. కాగా... కొంతకాలంగా నారాయణ దంపతుల మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో భార్యపై కోపంతో బాలుడిని తండ్రి చితకబాదాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

Updated Date - 2022-08-19T17:59:55+05:30 IST