Telangana: బొలేరో వాహనం బోల్తా...మహిళ మృతి
ABN , First Publish Date - 2022-01-08T15:36:54+05:30 IST
జిల్లాలోని వాజేడు మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది.
ములుగు: జిల్లాలోని వాజేడు మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. టేకులగూడెం గ్రామం బిరామయ్య గుట్ట సమీపంలో ఛత్తీస్గఢ్ నుంచి 27 మంది కూలీలతో వస్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లక్ష్మీ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా...పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఛత్తీస్గఢ్ బీజపూర్ జిల్లా పాపానపెల్లి గ్రామం నుంచి ధర్మారం వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.