నూతన సంవత్సరం రోజున రైతు ఇంట విషాదం
ABN , First Publish Date - 2022-01-01T16:26:40+05:30 IST
నూతన సంవత్సరం రోజున ఓ రైతు ఇంట విషాదం నెలకొంది.
ములుగు: నూతన సంవత్సరం రోజున ఓ రైతు ఇంట విషాదం నెలకొంది. జిల్లాలోని మంగపేట మండలం బోర్ నర్సాపురంలో యువ రైతు సందీప్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో, అప్పులిచ్చిన వారి వేధింపులు పెరగడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సందీప్... ధాన్యానికి నిప్పుపెట్టి ఆపై బలవన్మరణానికి యత్నించాడు. సందీప్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.