ములుగు: జిల్లాలోని వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల టేకులగూడెం - చత్తీస్ఘడ్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో వాజేడు - వెంకటాపురం ఏరియా కమాండర్గా గతంలో పనిచేసిన సుధాకర్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.