ముసలమ్మగుట్ట ఎన్కౌంటర్ మృతుల గుర్తింపు
ABN , First Publish Date - 2020-10-19T14:44:05+05:30 IST
జిల్లాలోని మంగపేట ముసలమ్మ గుట్ట ఎన్కౌంటర్ మృతులను పోలీసులు గుర్తించారు. మృతులు మంగపేట, మణుగూరు ఏరియా కమిటీ కమెండర్ సుధీర్,
ములుగు: జిల్లాలోని మంగపేట ముసలమ్మ గుట్ట ఎన్కౌంటర్లో మృతిచెందిన ఇద్దరు మావోయిస్టుల వివరాలను పోలీసులు తెలియజేశారు. మృతులు మంగపేట, మణుగూరు ఏరియా కమిటీ కమెండర్ సుధీర్, మరో నేత లాక్మాల్గా గుర్తించారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో ములుగు ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. గుత్తికోయ గూడెంలపై నిఘా ఏర్పాటు చేశారు. భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు ఏజెన్సీ అటవీ ప్రాంతంలో పోలీస్ కుంబింగ్ కొనసాగుతోంది. ముళ్లకట్ట అంతర్రాష్ట్ర వంతెన వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.