TS News: మావోయిస్టు కరపత్రాల కలకలం

ABN , First Publish Date - 2022-07-28T02:02:33+05:30 IST

ములుగు జిల్లా (Mulugu District) వెంకటాపురం మండలంలోని ఉప్పేడువీరాపురం గ్రామ సమీపంలో బుధవారం మావోయిస్టుల కరపత్రాలు వెలిశాయి

TS News: మావోయిస్టు కరపత్రాల కలకలం

వెంకటాపురం: ములుగు జిల్లా (Mulugu District)  వెంకటాపురం మండలంలోని ఉప్పేడువీరాపురం గ్రామ సమీపంలో బుధవారం మావోయిస్టుల కరపత్రాలు వెలిశాయి. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు జరిగే మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని అందులో కోరారు. అమరవీరులను స్మరించుకొని జోహార్లు అర్పించాలని, వారి  ఆశయాలను కొనసాగించాలని పేర్కొన్నారు. ఈ కరపత్రాలు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరిట వెలిశాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మండల కేంద్రానికి రాత్రి వచ్చే బస్సు సర్వీసులను రద్దు చేశారు. 

Updated Date - 2022-07-28T02:02:33+05:30 IST